క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని కల్గిస్తాయి

క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని కల్గిస్తాయి

క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని కల్గిస్తాయి

-మంచి శ్రీడాకారులుగా ఎదిగి గ్రామానికి పేరుతీసుకురావాలి

-ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు

-తల్లిదండ్రులను మర్చిపోతున్న రోజుల్లో తన తండ్రి బండి నర్సయ్య జ్ఞాపకార్థంగా క్రీడలను నిర్వహించటం అభినందనీయం

-చొప్పదండి ఎంపీడివో దమ్మని రాము

  • మొదటి విజేతలకు రూ. 3000, రెండవ విజేతలకు రూ. 2000 బహుమతుల అందజేత

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట టౌన్ :


క్రీడలు శారీరక మానసిక వికాసాన్ని కల్గిస్తాయని ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు అన్నారు.. సిద్దిపేట రూరల్ మండలం రావురుకులలో గ్రామానికి చెందిన కీ.శే.బండి చిన్న నర్సయ్య జ్ఞాపకార్థం సేవ భావ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సహకారంతో నిర్వహించిన మండల స్థాయి క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసి ఆయన మాట్లాడారు. యువకుల చేతుల్లో భవిష్యత్ ఉందని సన్మార్గంలో నడిచి గ్రామానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. తాను రావురుకుల గ్రామంలో పెరిగిన మట్టి వాసనలతోనే ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. తాను రాసిన రావురుకుల పుస్తకానికి రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయని చెప్పారు. మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాంత్ ను అభినందించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు ,చొప్పదండి ఎంపిడిఓ దమ్మని రాము మాట్లాడుతూ తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ రోజుల్లో తన తండ్రి జ్ఞాపకార్థంగా క్రీడలను నిర్వహిస్తున్న శ్రీకాంత్ ను అభినందించారు.ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొంది తాను పుట్టిన గ్రామంలో సేవ కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయం అన్నారు. గ్రామీణ యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి తల్లిదండ్రుల కళలను నిజం చేయాలని చెప్పారు. సమాజం లో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలి అన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా నిలవాలన్నారు. యువత సమాజంలో ఉన్న రుగ్మతలను నివారించాలని చెప్పారు. ఈ సందర్భంగా డా . శ్రీకాంత్ రచించిన జువాలజీ మేడ్ ఈజీ ఆక్వాటిక్ బయాలజీ, జువాలజీ ఈజీ మేడ్ సెరికల్చర్ పుస్తకాలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డా శ్రీకాంత్ మాట్లాడుతూ తన చిన్నతనంలో తండ్రి చనిపోయాడని తన తల్లి గోదావరి చదువుతోనే అభివృద్ధి చెందగలమని భావించి బాగా చదివిందని చెప్పారు. తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ప్రతిక్షణం ఆలోచిస్తానని చెప్పారు. తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ 3000 , రెండవ బహుమతి రూ 2000 మెమెంటోలు , స్పోర్ట్స్ కిట్ లను అందజేశారు . ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కవిత రవీందర్, తాజా మాజీ ఉపసర్పంచ్ మారెడ్డి శ్రీకాంత్ రెడ్డి,తాజా మాజీ వైస్ ఎం పీపీ శేరుపల్లి యాదగిరి , గ్రామ యువకులు కొమ్ము రవీందర్, రంజిత్ కుమార్, బి. స్వామి, కె.రమేష్ వెంకట్ , సురేష్, హరికిషన్, మధు, పర్షరములు, సాయిరెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *