అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం

అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం

మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం

భారీగా పాల్గొన్న హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు హుస్నాబాద్ ప్రజల సంక్షేమం కోసం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.  శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం కరీంనగర్ , సిద్దిపేట జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి,  మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్లు  హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్, ఇతర ముఖ్య నేతలు వేలాది గా హుస్నాబాద్ ప్రజలు పాల్గొని బోజనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కార్తీక మాసం సందర్భంగా ఏకాదశి పర్వదినాన నియోజకవర్గ ప్రజలంతా సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నిర్వహించుకున్నమన్నారు. ప్రజలంతా వచ్చి సత్యనారాయణ స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా పాడి పంటలతో మంచి వర్షాలతో ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సత్యనారాయణ స్వామిని వేడు కొన్నానని అన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *