మంత్రి పొన్నం ప్రభాకర్ కు సిపిఐ కృతజ్ఞతలు

మంత్రి పొన్నం ప్రభాకర్ కు సిపిఐ కృతజ్ఞతలు

మంత్రి పొన్నం ప్రభాకర్ కు సిపిఐ కృతజ్ఞతలు

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయుటకు, సర్దార్ సర్వాయి పాపన్న నడయాడిన స్థలాలను అభివృద్ధి చేయుట కోసం 4.70 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి నిధుల విడుదల కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ ఆదివారం నాడు కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ మండలం మహ్మదపూర్, ఉమ్మపూర్ గ్రామాల్లోని బయ్యన్న, భూషణ గట్లు, సర్వాయి పాపన్న కోటలు దోపిడీ రాజ్యాలకు తిరుగుబాటు చేసిన కేంద్రాలని వర్తమాన, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే చారిత్రక కట్టడాలని హుస్నాబాద్ ప్రాంత విప్లవ వీరుల అమరత్వాన్ని గుర్తు చేసే ఆకాశమంత ఎత్తైన అమర వీరుల స్తూపమే సాక్ష్యమని అమరుల చరిత్రలను నిక్షిప్తం చేసే సాహసం వీరులు వీర మరణం పొందిన నేలలో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు నిర్మాణం అత్యంత అవసరమని సిపిఐ భావిస్తుందని గడిపె మల్లేశ్ అన్నారు.

ఆవైపుగా అడుగులు వేస్తు నిధులు మంజూరు కోసం కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు గడిపె మల్లేశ్ తొ పాటు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, కొయడ కొమురయ్య, పిట్టల బాలయ్య, ఎగ్గోజు సుదర్శన్ చారి, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజు కుమార్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ కార్యదర్శి పిల్లి రజని, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం పట్టణ అధ్యక్షులు కాల్వల ఎల్లయ్య సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి, పొదిల కుమారస్వామి, పిట్టల ప్రసాద్, ఇజ్జగిరి కిష్టయ్య, గుగ్గిల్ల మల్లేశం, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Show 1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *