రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి..బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక..కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు..

రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి..బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక..కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు..

రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి..
ప్రభుత్వం ఇచ్చిన యాడ్స్ లో జై తెలంగాణ పదం లేదు..
బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక..
1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విజయాన్ని అందించింది సిద్దిపేటనే..
కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు..
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి:
1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమంకు విజయాన్ని అందించింది సిద్దిపేటనేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు  వేడుకల్లో భాగంగా పొన్నాల లోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ జెండా, జాతీయ జెండాను ఆవిష్కరించి, రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా  రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రాష్ట్ర ప్రజలకు పండగ అని తెలిపారు. సిద్దిపేట లేకుంటే కెసిఆర్ లేడనీ.. కెసిఆర్ లేకుంటే తెలంగాణ లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని , బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని ఖతం చేస్తారని అన్నారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో కలుపాలని ఆంధ్ర నాయకులు అంటున్నారని మండి పడ్డారు.


రాష్ట్ర ప్రయోజనాల కాపాడాలంటే కెసిఆర్ శ్రీరామ రక్ష అన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన పత్రిక ప్రకటనలో జై తెలంగాణ పదం లేదని మండి పడ్డారు. తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ బిఆర్ఎస్ అన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ఉద్యమ కారుడు కాలేడని అన్నారు.
రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అవుతాడు తప్ప ఉద్యమ కారుడు కాదని నిప్పులు చెరిగారు. ఉద్యమం కోసం ఎన్నిసార్లు అయినా తాము జైల్ కి వెళ్ళామ్మన్నారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేసింది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మూడవ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. 


ఉద్యమంలో సిద్దిపేట మట్టి బిడ్డలు రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారనీ గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో రామలింగారెడ్డి, నందిని సిధారెడ్డి, రమణ చారి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, దేవి ప్రసాద్ ల సేవలు మరువలేనివి , వారిని గుర్తుంచుకోవడం మన కర్తవ్యం అన్నారు. ఉద్యమంలో నిస్వార్థంగా సేవ చేసిన వారిని గుర్తుంచుకోవడం నిజమైన పండగన్నారు. తెలంగాణ ఉద్యమం చాలా సార్లు విఫలమైందని, ఉద్యమానికి, కేసిఆర్ కి సిద్దిపేట మట్టి బిడ్డలు కుడి భుజంగా నిలిచారన్నారు.
అనంతరం ఉద్యమ కారులను సన్మానించారు. ఈ సందర్బంగా దేశపతి శ్రీనివాస్ ఉద్యమం జరిగిన తీరును తన పాటలతో వివరించారు.ఈ కార్యక్రమంలో  దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే ఒడితేల సతీష్, రసమయి బాలకిషన్, ఎంఎల్ సి యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేర్ ప్రతాప్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ,  నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, పాల సాయి రాం, కత్తి కార్తీక, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *