భర్త లంచం తీసుకుంటే భార్యకూ శిక్ష..
మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..
ఓ ఎస్సై లంచ్ కేసులో వాదనలు..
కేసు కొట్టేయబోమన్న న్యాయమూర్తి..
కింది కోర్టు తీర్పుపై సమర్థన..
సిద్దిపేట టైమ్స్, వెబ్;
ప్రభుత్వ ఉద్యోగి తీసుకునే లంచంలో భార్యకు భాగ స్వామ్యం ఉంటే ఆమె కూడా శిక్షకు అర్హురాలేనని మ ద్రాసు హైకోర్టు మదురై బెంచ్ అభిప్రాయపడింది. ఆ దాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో భర్తతో పాటు భార్యకు కూడా శిక్ష వేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేయడానికి తిరస్కరించింది. భర్త తరపున భార్య లంచం పుచ్చుకోవడం తప్పేనని, ఇందు కు ఆమెకు శిక్ష వేయాల్సి ఉంటుందని పేర్కొంది.
సబ్ ఇన్స్పెక్టర్పై కేసు నమోదు..
1992 జనవరి 1 నుంచి 1996 డిసెంబరు 31 వరకు ఆదాయానికి మించి రూ.6.77 లక్షలు అధికంగా కలిగి ఉన్నా రంటూ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ శక్తివేల్సై కేసు నమోదయింది. తిరుచ్చిలోని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (డీవీఏసీ) పోలీసులు ఆయనతో పాటు, లంచం సొమ్ము తీసుకున్నందుకు ఆయన భార్య దైవ నాయకి పైనా కేసు పెట్టారు. కేసు విచారణలో ఉండగానే శక్తివేల్ మరణించారు. విచారణ జరిపిన అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు దైవ
నాయకికి ఏడాది జైలు శిక్ష, రూ. వేయి జరిమానా వి ధిస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టులోని మదురై బెంచ్ లో అప్పీలు చేశారు.
కేసు కొట్టేయబోమన్న న్యాయమూర్తి
విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కె.కె.రామకృ ప్షన్ కింది కోర్టు ఇచ్చిన కొట్టివేయడానికి నిరాకరిం చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోకుండా చూడాల్సిన బాధ్యత భార్యపై ఉంది. ఆ సొమ్ముతో వారు సంతోషపడ్డారంటే ఆ బాధను కూడా అనుభవించా ల్సిందే. భర్త తరపున లంచం తీసుకుంటే ఇంటి నుంచే అవినీతి ఆరంభమవు తుంది. అవినీతిలో ఇల్లాలికి కూడా భాగస్వామ్యం ఉంటే ఇక అక్రమాలకు తావు ఉండదు.