
ప్రజలు ఎలాంటి ఆందోళన చెండొద్దు.. అప్రమత్తంగా ఉండాలి..
ముంపు పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట
ప్రజలు ఎలాంటి ఆందోళన చెండొద్దని.. అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట లోని ముంపు ప్రాంతాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు.
సిద్దిపేట పట్టణం లో కురిసిన వర్షాలకు కోమటి చెరువు నాల వరద ఉదృతికి గురైన ముంపు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించి సందర్శింకమచారు. క్షేత్ర స్థాయి లో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతు.. ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వర్షం పడిందని.. తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. గత 20 సంవత్సరాలలో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదన్నారు. భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయన్నారు. సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలిగించామన్నారు. నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం వాగు, మందపల్లి వాగు వైపు నీళ్లు మళ్లించామన్నారు. భవిష్యత్తులో వరద వచ్చినపుడు ఎలా చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించారు. ప్రజలు కూడా సహకరించాలి.. నాలాలు కబ్జాలు చేసి సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయన్నారు. నాలాలు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నాక వరదలు వస్తే బాధపడితే ఎలా అన్నారు. లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని ఇల్లు నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరవేక్షణ చేయాలన్నారు. ప్రజలు ఆందోళన చెందోదని కోరారు.








