సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం చిత్రపటానికి పంచామృతాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం చిత్రపటానికి పంచామృతాభిషేకం

హుస్నాబాద్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరియు బిసి సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పంచామృత అభిషేకం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ మరియు రైతుల ఆధ్వర్యంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ పై నిన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పంచామృత అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేస్తాము అని ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి లక్ష రూపాయలు కూడా రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని, ఈరోజు మీరు ఎప్పుడు రైతు రుణమాఫీ చేస్తారు అని డేట్ చెప్పండి అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు అని, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఆగస్టు 15 లోపు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే విధంగా విధి విధానాలను రూపొందించినందుకు రేవంత్ రెడ్డి కి మంత్రివర్గం బృందానికి కృతజ్ఞత తెలుపుతూ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి కేడం లింగమూర్తి, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లపు రాజు, భూక్య సరోజన, పున్న సది లావణ్య, వేన్న రాజు, పోతుగంటి బాలయ్య, సంఘ కుమార్, బిక్యా నాయక్, రమేష్ నాయక్, తిరుపతి నాయక్, గాలిపల్లి శ్రీనివాస్, సుంకరి ప్రదీప్, కేశవేణి రమేష్, కోడి ముంజ మహేందర్, దండి లక్ష్మి, నాయిని రజిత, కమలమ్మ, పుదారి శ్రీనివాస్ గౌడ్, విక్రమ్, మరియాల రాజిరెడ్డి, సుక్క తిరుపతి, బి కే నాయక్, వేల్పుల సంపత్, కైలు నాయక్, గోపాల్ స్వామి దండి కొమురయ్య, బినవేని కనకయ్య ,మాటూరి బాలయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *