సిద్దిపేట టైమ్స్
జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్సు నిబంధనలు అమలులోకి రానున్నాయి అని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2024 జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధించాలని రవాణా శాఖ నిర్ణయించింది. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు. మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు. అంతేకాకుండా మైనర్ కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు.