సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…ఎస్సై మహేష్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు

అపరిచిత వ్యక్తుల వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు

హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న సిద్ధార్థ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవిటీజింగ్ నూతన చట్టాల గురించి హుస్నాబాద్ ఎస్ఐ మహేష్, హుస్నాబాద్ షీటీమ్ బృందం తో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్ మహేష్ మాట్లాడుతూ…. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, సైబర్ నేరాల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి, గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి, మహిళలు గృహ హింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు. విద్యార్థుల యొక్క గోల్ గురించి, అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశ చాలా కీలకమని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, అధ్యాపకులు హుస్నాబాద్ షీటీమ్ బృందం సదయ్య , హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, ప్రశాంతి, కానిస్టేబుళ్లు కృష్ణ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *