హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా

హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం..

ఈ సమావేశంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి పై తీసుకోవాల్సిన చర్యలు, ఎల్లమ్మ బండ్ అభివృద్ది, శానిటేషన్, రోడ్ల నిర్మాణం, మున్సిపల్, వేజ్ & నాన్ వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణాల పురోగతి తదితర అంశాల పై సమీక్ష నిర్వహించారు.

మున్సిపల్ సమీక్షా సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ… హుస్నాబాద్ మున్సిపల్ అభివృద్ధి పై ఏజెన్సీ ఇచ్చిన  ప్రణాళిక మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ప్రతిపాదనలు చేయడం జరిగింది అని, వచ్చే 15 రోజుల్లో లిఖిత పూర్వకమైన సవరణలు, సలహాలు సూచనలు  ఇవ్వాలని కోరారు. వాటిపై నివేదిక తయారు చేసి ఫేజ్ -1, ఫేజ్ -2 లో చేయాల్సిన వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని, రోడ్లు , డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ సిస్టమ్, ఎల్లమ్మ చెరువు లాంటి వాటిపై ప్రాధాన్యత గా తీసుకుంటాం అన్నారు.

మున్సిపల్ ను భవిష్యత్ లో వివిధ రకాలుగా అభివృద్ధి చేయడానికి హుస్నాబాద్ మున్సిపల్ పాలక వర్గ నూతన భవనం, లైబ్రరీ, సెట్విన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణ కేంద్రం, ఎసిపి కార్యాలయం, పాత భవనాలు తీసేసి స్థలాన్ని సద్వినియోగం చేసుకునేలా ఒక కాంప్లెక్స్ నిర్మించే ప్రణాళిక చేస్తున్నాము అని అన్నారు.

పట్టణాన్ని అభివృద్ది చేయడానికి ప్రజలనుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తానని అన్నారు. హుస్నాబాద్ కి బైపాస్ ప్రతిపాదనలు తయారవుతున్నాయని, వెజిటేబుల్, నాన్ వెజిటబుల్ మార్కెట్, స్టేడియం త్వరలోనే సందర్శించి, కౌన్సిలర్లు పలు వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ సిస్టం లాంటివి దృష్టికి తీసుకొచ్చారనీ భవిష్యత్ లో ఇబ్బందులు లేకుండా చేస్తా అని అన్నారు. అరేపల్లి ప్రాంతాన్ని , కొత్త చెరువును కూడా అభివృద్ధి చేయాలని సూచించారు.

తడి, పొడి చెత్త వాహనాలకు వేయాలి. మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకుండా నీళ్ళు లేకుండా చూసుకోవాలి. మున్సిపల్ పాలక పక్షాన ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజలంతా వాటికి సహకరించాలి అని అన్నారు.

నేషనల్ హైవే పనులలో మొదట ఎక్కడెక్కడ తవ్వారో అక్కడ పనులు పూర్తి చేయాలని, వర్షాకాలం లోపు రోడ్లు పనులు పూర్తి చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చా అని అన్నారు. పట్టణంలో ఉన్న కౌన్సులర్లను, నేషనల్ హైవే అధికారులను, ఇతర అధికారులను పిలిచి మాట్లడిన, పట్టణం లో ఎక్కడ ఆటంకం లేకుండా పనులు ముందుకు తీసుకువెళ్తానని, గతంలో అనుమతులు పొంది ఉన్న వాటి పనులు జరగాలి అని అన్నారు

రాష్ట్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల రుణమాఫీ విధివిధానాల జీవో త్వరలోనే వస్తుందని ఫేజ్ ల వారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ పూర్తవుతుందని, రైతు బిడ్డగా సహచర మంత్రులకు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు ధన్యవాదాల తెలుపుతూ ఈ మహత్తర ఘట్టంలో క్యాబినెట్ మంత్రిగా పాల్గొన్నందుకు సంతోషకరంగా ఉంది అని అన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థల) గరిమా అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మున్సిపల్ కౌన్సిలర్ల , వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *