సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఆఫిస్ లొ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల కలెక్టర్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడం, ఇరిగేషన్, రోడ్లు, మిషన్ భగీరథ, విద్యా, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య, అడిషనల్ కలెక్టర్లు, మూడు జిల్లాలకు సంబంధించిన వివిధ విభాగాల అధికారులు.
