ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు  బస్సు లో ప్రయాణం..

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి; మే 7

రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సు లో  చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తమ సమస్యలు అడిగి తెలుసుకోవడం పై ప్రయాణికుల హర్షం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళల తో ముచ్చటించారు.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో అందుతున్న ఉచిత ప్రయాణం పై ఆరా తీశారు. ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ డిపో కి చెందిన ఎక్స్ ప్రెస్ బస్సులో చాలా వరకు మహిళా ప్రయాణికులు ఉండడంతో మహా లక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీ కి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీ నీ నిర్వీర్యం చేస్తా తాము ఆర్టీసీని నిలబెట్టామని  తెలిపారు. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేశామని దేశానికి తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. తమకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్న ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.. బాగా చదువుకోవాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ తో మాట్లాడారూ.. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని, నిన్న జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా చెప్పమన్నారు. సమ్మె పై వెనక్కి  తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *