సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలో భాగంగా సోమవారం పట్టణంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని పట్టణంలోని పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో, షాపుల యజమానులతో, చిరు వ్యాపారులతో ముచ్చటించారు. పలు ప్రజా సమస్యలను పట్టణ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు.
సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి, హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వైడింగ్, నాళాల నిర్మాణాలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాళాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్చేసిన ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పూదరి వజ్రవ్వ చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పట్టణంలోని విజయ పాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘాన్ని సందర్శించి, రొజు వస్తున్న పాలు ఎన్ని… ప్రజలు ఇళ్లలోకి వెళ్తున్న పాలు ఎన్ని వివరాలు ఆరా తీశారు.

