మెదక్ అల్లర్ల లో నిర్లక్ష్యం వహించిన మెదక్ సిఐ లు బదీలీ..
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
బక్రీద్ పండుగ కు 2 రోజుల ముందు మెదక్ పట్టణంలో రెండు వర్గాలు రాళ్ళు రువ్వుకొని, కత్తి పొట్ల గురై అల్లరులు చెలరేగిన సంఘటనలో మెదక్ టౌన్,రూరల్ సీఐ లు దీలిప్,కేశవ్ లను బదిలీ చేశారు.ఈ మేరకు ఐజి రంగనాథ్ మెదక్ లో 2 రోజులపాటు ఉండి విచారణ చేసిన విషయం తెలిసిందే.షమ అల్లర్ల ను అదుపు చేయడంలో పోలీస్ లు విఫలమయ్యారు. దీంతో 2 వర్గాలు రోడ్లపై కి వచ్చి రచ్చ చేసిన విషయం తెల్సిందే. ఇరు వర్గాల కు చెందిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఐతే పోలీస్ లు గొరక్షణ సమితి సభ్యులు ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై సరిగా స్పందించక పోవడంతోనే 2 వర్గాల గొడవలకు కారణమైందని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించిన విషయం తెల్సిందే.