ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్..
కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలసిన ఈవో
సన్మానించిన ఆలయ చైర్మన్ బాలగౌడ్
సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి:

పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇవో గా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుదవారం ఏడుపాయల దేవాదాయ శాఖ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంచార్జీ ఈవో గా పని చేసిన వినోద్ రెడ్డిని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ
ఏసీగా నియమించడంతో ఆయనస్థానంలో కృష్ణ ప్రసాద్ ను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఏడుపాయల వన దుర్గామాత ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కృష్ణ ప్రసాద్ మెదక్ కలెక్టరేట్ కు వెళ్లి కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిశారు.. ఆలయ చైర్మన్ బాలగౌడ్ నూతన ఈవో ను శాలువాతో సన్మానించారు. ఆలయ అధికారులు సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు.
