బిజెపి, బీఆర్ఎస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది

బిజెపి, బీఆర్ఎస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది

బిజెపి, బీఆర్ఎస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన వైపు ప్రజల కోసం పనిచేస్తుంది

బిజెపి, బీఆర్ఎస్ ల పై హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల ఫైర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు మాట్లాడుతూ.. శుక్రవారం బిజెపి నాయకులు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎలాంటి నిధులు తీసుకురాలేదని రాజీనామా చేయాలని మాట్లాడడం సరికాదని రాష్ట్రం నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలు ఉన్నా కేంద్రం రాష్ట్రానికి మొండిచేయి చూపితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా కూడా ఇవ్వని విధానం ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ కాదు అని కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవడానికే ఏర్పాటు చేసిన బడ్జెట్ గా ఉందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు బిజెపి కి 8 మంది ఎంపీలను ఇస్తే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర వివక్ష చూపిందని ఆక్షేపించారు. ఈ కేటాయింపులపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

అలాగే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి రెండో తారీకు ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టి 50వేల మంది రైతులతో వచ్చి కాలేశ్వరం ముట్టడి అని అవగాహన లేక మాట్లాడుతున్నారని, కేసీఆర్ చేసిన తప్పిదం వల్ల లక్ష కోట్లు ప్రజాధనం వృధా అయిందని, గత ప్రభుత్వం చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ప్రాజెక్టులో నీరు నిలువ చేస్తే 30, 40 గ్రామాలు జలదిగ్బంధంలో మునుగుతాయని నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన వైపు ప్రజల కోసం పనిచేస్తుంది అని అన్నారు.

బిజెపి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఇంకోసారి మా మంత్రులపై గాని ప్రభుత్వం పై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరించారు.

ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, మహిళా జిల్లా అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మి, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ భుక్య సరోజన, మాజీ పట్టణ అధ్యక్షులు ఆక్కు శ్రీనివాస్, వెన్నరాజు, బూరుగు కృష్ణస్వామి, పీళ్లి తిరుపతి, పోతుగంటి బాలయ్య, సంఘ కుమార్, బికే నాయక్, గొట్టే కవిత బోనగిరి, రజిత చిదురాల స్వరూప, పిన్నింటి సుష్మ, కుండ్ర రమాదేవి, బోయిని కమలమ్మ, చావుల కోటేశ్వరరావు, సావుల రమేష్, తరాల మహేందర్, దూబల శీను, కేశవేణి రమేష్, గడిపే బాలు, కోడిముంజు మహేందర్, పబ్బ రమాదేవి, తాళ్లపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *