ఇక హైదరాబాద్ మనదే? నిన్నటితోముగిసిన పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు…
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొన సాగిన ఉమ్మడి బంధానికి నిన్నటి తో తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని లేని విభజిత ఏపీకి హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూ కేంద్రం ప్రకటించింది.
ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఇకపై హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతం లో పౌరుల ప్రాణ,ఆస్తి, రక్షణ,భద్రతను కాపాడే బాధ్యతను గవర్నర్కు అప్పగించారు.
ఇప్పుడీ గడువు ముగియ డంతో ఈ బాధ్యతను ప్రభుత్వం చూసుకుంటుంది. ఏపీకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించి పాలన అందించారు. 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన ప్పటికీ రాజధాని పలానా అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది.