హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్


సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితర ముఖ్య నేతలు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కి చేప ప్రసాదం వేసిన బత్తిని హరినాథ్ గౌడ్. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం మృగశిర కార్తి సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది అని అన్నారు.
చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారు. 150 సంవత్సరాలుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఫిష్ మెడిసిన్ వేసుకుంటారని, వివిధ దేశాలు ,ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం వస్తున్నారు. బత్తిని కుటుంబంలోని సభ్యులందరూ ఈ చేప ప్రసాదం వేయడానికి ఇక్కడే ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం కోసం చేపలు ఏర్పాటు చేయడం తో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం అని అన్నారు.