హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని పెంచుతా

త్వరలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి చే ఫౌండేషన్

సమగ్ర కుల గణన సర్వే లో తెలంగాణ దేశానికి దిక్సూచి

ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచుతానని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఉప ముఖ్యమంత్రి లతో అభివృద్ధి పనులకు ఫౌండేషన్ వేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని హుస్నాబాద్ మున్సిపాలిటీలో ని 3,4,5,18 వార్డుల్లో ఒక్కో వార్డుకు 50లక్షల చొప్పున 2 కోట్ల రూపాయలతో  రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంఖు స్థాపన చేసిన అనంతరం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… పట్టణంలోని 20 మున్సిపల్ వార్డుల్లో 50 లక్షల చొప్పున ప్రతి వార్డులలో పనులు చేపట్టడం జరిగిందన్నారు. హుస్నాబాద్ లో రీడింగ్ రూమ్స్ పేరుతో అన్ని కులాలకు 45 లక్షల చొప్పున  కేటాయించడం జరిగిందన్నారు. బుడగ జంగాలకు కూడా ఇందిరమ్మ పేరు మీద కమ్యూనిటీ హల్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బుడగ జంగాల కాలనీ వద్ద ఇందిరమ్మ విగ్రహం ఏర్పాటు చేసి ఆ చౌరస్తా ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. బుడగ జంగాల కాలని కి అవసరమైన రోడ్లు నిర్మిస్తామని అందుకు సంబంధించిన వాటి వివరాలు సేకరించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో గాంధీ, అంబేద్కర్, నాగరం, కరీంనగర్ చౌరస్తా ల అభివృద్ధికి  50 లక్షల చొప్పున కేటాయించుకున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు బండ్ అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు టెండర్ ఐపోయి సిద్ధంగా ఉందనీ, పూర్తైన భవనాలు ఏసిపి, ఆర్డీవో, మార్కెట్, లైబ్రరీ, మున్సిపాలిటీ, కరీంనగర్ 4 లైన్ల రహదారి మొదటి దశకు 75 కోట్లకు కేటాయించడం జరిగిందనీ,150 పడకల ఆసుపత్రి, సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం అభివృద్ధి, మహాసముద్రం గండి అభివృద్ధి, ఆర్టీవో ఆఫీస్ స్థలం సేకరించడం జరిగిందని స్టేడియం పనులు ఇలా అన్నిటికీ ఒకేసారి ప్రారంభించుకోవడానికి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ని తీసుకొచ్చి ఫౌండేషన్ వేయాలని కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. హుస్నాబాద్ లో వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి రాకుండా డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు  చేయడానికి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నామన్నారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు చిరస్థాయిగా గుర్తుండేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. వరి ధాన్యం కొనుగోలు, పత్తి మార్కెట్ కేంద్రాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇండస్ట్రియల్ ఎండీ తో కలిసి చౌటపల్లి వద్ద స్థల పరిశీలన చేశామని దాని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని ఏదైనా సలహాలు సూచనలు చేయవచ్చని పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని పెంచుతానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఒక రోల్ మోడల్ గా దేశానికి దిక్సూచి లాగ కుల గణన సర్వే జరుగుతుందనీ ప్రజలంతా సహకరించాలని కోరారు.ఈ సర్వే ఎక్స్ రే మాదిరి సమాజం లో ఉన్న రుగ్మతలు తేడాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఎన్యుమరేటర్స్ తో కలిసి ఇంటికి స్థిక్కరింగ్ వేశారు. సమగ్ర కుల గణన ఇంటింటి కుటుంబ సర్వే కి ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణ లో ప్రజా ప్రభుత్వం  ఏర్పడగానే 10 లక్షల ఆరోగ్య శ్రీ , 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కి గ్యాస్ ఇస్తున్నామని ఎవరికైనా రాకపోతే అధికారులను సంప్రదించాలన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. వ్యవసాయానికి సంబంధించి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ పూర్తైందనీ. 2 లక్షల పైన ఉన్న వారికి కుటుంబ నిర్ధారణ పూర్తైంది పైన డబ్బులు చెల్లిస్తే మిగిలినవి మాఫీ అవుతాయి త్వరలోనే దానికి సంబంధించిన విది విధానాలు వస్తాయన్నారు. హుస్నాబాద్ పట్టణంలో 2006 లో 8 రేషన్ షాపులు ఉంటే  2024 లో కూడా 8 ఉండడం దురదృష్టకరమన్నారు. ఎంత జనాభా కి ఎన్ని రేషన్ షాపులు ఉండాలని వివరాలు సేకరించాలనీ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో కొత్త రేషన్ షాపులు తీసుకొచ్చి ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.

కలెక్టర్ మను చౌదరి  మాట్లాడుతూ…హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువు, మున్సిపల్ కార్యాలయం, లైబ్రరీ బిల్డింగ్, మరియు ఓవర్ అల్ వర్క్స్ వార్ పుట్టింగ్ లో పూర్తి చేసి ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మంచి సంకల్పంతో పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో పగడ్బందీగా చేపట్టామనీ తెలిపారు. సర్వే కోసం ఇంటింటికి వచ్చే ఎన్యూమారేటర్  అధికారులకు వివరాలు పూర్తిగా అందించాలని సూచించారు. జిల్లాలో 2 లక్షల 36 వేల ఇండ్లు ఉన్నాయనీ గ్రామలు, పట్టణాలలో సర్వే కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించామనీ, నవంబర్ చివరి వరకు సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న ,  వైస్ చైర్మన్ ఐలేని అనిత, సిద్దిపేట గ్రంథాలయ కమిటీ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *