హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి.

హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి.

హుస్నాబాద్ బీసీ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలకు సొంత భవనం కేటాయించాలి..

అద్దె భవనంలో గదులు సరిపోక  కళాశాల వర్గల్ కు తరలింపు..

బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించాలి

ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ లోని పోతారం లో గల మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల పాఠశాల/కళాశాల  అద్దె భవనంలో కొనసాగుతుందని, సొంత భవనం నిర్మించేలా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్  ఒక ప్రకటనలో కోరారు.

ఈ సందర్భంగా జనార్థన్ మాట్లాడుతూ హుస్నాబాద్ కు మంజూరైనటువంటి మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల/కళాశాల గత ఆరు సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతుందని సొంత భవనం లేక అద్దె భవనంలో ఉన్న గదులలో విద్యార్థినిలు ఉంటూ ఇబ్బందులకు గురవుతున్నారని, గత సంవత్సరం ఈ పాఠశాల కళాశాలగా మారినప్పటికీ సరిపడు తరగతి గదులు లేక విద్యార్థినిలను సిద్దిపేట జిల్లా వర్గల్ కు బిసి గురుకుల పాఠశాలకు అనుసంధానం చేశారని, ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి అడ్మిషన్లను ఇక్కడ చేర్పించుకుని తరగతులు, హాస్టల్ వసతి కోసం వర్గల్ బీసీ గురుకులకు పంపిస్తున్నారని, అద్దె భవనం మరియు గదులు  సరిపోకపోవటం వల్లనే ఇలా  జరిగిందని ఆయన అన్నారు. హుస్నాబాద్  ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాల పూర్తిగా వర్గల్ కు వెళ్లిపోతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని, స్థానిక  విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వాపోయారు. ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ పరిశీలించి దీనిపై వెంటనే స్పందించాలని హుస్నాబాద్ బీసీ గురుకుల బాలికల పాఠశాలకు స్వంత భవనం  నిర్మించాలని ఆయన కోరారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *