హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధుల మంజూరు

హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధుల మంజూరు

హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి భారీగా నిధుల మంజూరు

నిధుల విడుదల కు సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వివిధ రోడ్లు వంతెన నిర్మాణం కోసం పంచాయతీరాజ్ CRR  గ్రాంట్స్ నుండీ రూ.1149 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో భారీగా రోడ్ల నిర్మాణం వంతెనల కోసం నిధుల విడుదల కు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కి ధన్యవాదాలు తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో కోహెడ నుండి తంగలపల్లి (వయ కురెళ్ళ) వరకు 1.10 కిమి బిటి రోడ్డు కోసం రూ.155 లక్షలు, కోహెడ మండలం  తంగలపల్లి నుండి శ్రీరాములపల్లి PWD రోడ్డు వరకు ( వయ కోహెడ మండలం సోమరంపల్లి) వరకు 1.60 కిమీ బిటి రోడ్డు నిర్మాణం కోసం రూ.150 లక్షలు, హుస్నాబాద్ మండలం పందిల్ల స్టేజి R/F సిద్దిపేట PWD రోడ్డు నుండి పొట్లపల్లి వరకు ఉన్న సింగిల్ లైన్ రోడ్డు నుండి 5.50 కిమీ డబుల్ లైన్ రోడ్డు విస్తరణ  కోసం రూ.395 లక్షలు, అక్కన్నపేట మండలం సంజీవయ్య కాలని లో R&B రోడ్డు 1.25 కిమి కోసం రూ.140 లక్షలు, అక్కన్నపేట మండలం R/F PWD రోడ్డులో c/o CD వర్క్స్ కోసం చౌటపల్లి మీదుగా మల్లంపల్లి వరకు రూ. 100 లక్షలు, అక్కన్నపేట మండలం జడ్పీ రోడ్డు నుండి పరికబండ వరకు 0.50 కిమీ కోసం రూ.60లక్షలు, తోటపల్లి నుండి పుసవర్లపల్లి మధ్య వంతెన నిర్మాణం కోసం రూ. 149 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ఇంత భారీ ఎత్తున నిధులు మంజూరు కావడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *