ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న హై కోర్ట్ జడ్జి జస్టిస్ విజయసేన్ రెడ్డి…
హరిత హోటల్ లో పోలీస్ గౌరవ వందన స్వీకరించిన హై కోర్ట్ జడ్జి
పూల బొకేలతో ఘనంగా స్వాగతం పలికిన-మెదక్ జిల్లా జడ్జి లక్మి శారద, సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఎస్పీ ఉదయ్ కుమార్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,

సిద్దిపేట టైమ్స్:మెదక్ ప్రత్యేక ప్రతినిధి:
శనివారం మెదక్ జిల్లా హైకోర్టు జడ్జి జస్టిస్ విజయ్ సెన్ రెడ్డి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని మాతను దర్శించుకున్నారు.
ఆయనకు ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు. శంకర్ శర్మ,పార్థివ శర్మ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.ఆలయ ఈఓ చంద్ర శేఖర్ అమ్మవారి చిత్రపటాన్ని జడ్జికి బహుకరించారు.
ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ ప్రిన్సిపల్ నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్, నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీపతిరావు, న్యాయవాదులు ప్రతాపరెడ్డి, జనార్దన్ రెడ్డి బాలయ్య , శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, చిరంజీవి. రవి గౌడ్ జిల్లా పాలన యంత్రాంగం బార్ అసోసియేషన్ ప్రతినిధులు పోలీస్ రెవిన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



