రైతు డిక్లరేషన్ బూటకమేనా..సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి హరీశ్ రావు బహిరంగ లేఖ..

రైతు డిక్లరేషన్ బూటకమేనా..సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి హరీశ్ రావు బహిరంగ లేఖ..

  • మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు బుట్టదాఖలు కావాల్సిందేనా
  • 48 రోజులైనా రైతుల ఖాతాల్లో జమ చేయలే
  • సన్నవడ్లకు 432 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ
  • సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి హరీశ్ రావు బహిరంగ లేఖ

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి,
సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని, అవన్నీ బుట్టదాఖలేనా అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.
“2లక్షల రూపాయల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేసారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారు. ఇప్పుడేమో సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారు. రైతు పండించిన అన్ని పంటలకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని ఆనాడు ప్రకటించి యూటర్న్ తీసుకున్నారు. అన్ని పంటలకు బదులు కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మార్చారు. మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయింద”ని హరీశ్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల దాన్యానికి సంబందించిన 432 కోట్ల రూపాయల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయని, వరి దాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నా ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదన్నారు. రెండో పంటకు సిద్దం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అదికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించిందని, నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టర్ ను కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నది నిజమే, ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాదానం ఇచ్చారని గుర్తు చేశారు. బహిరంగ మార్కెట్ లో 2800 రూపాయల నుండి 3000 రూపాయల ధర పలుకుతున్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వాన్ని నమ్మి దాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారని హరీశ్ అన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్దమా..? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా..? సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో రైతులంతా గుండెధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేశారని, మీ పాలనలో వ్యవసాయం దండగలా మారిందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, “మీ రైతు డిక్లరేషన్ లో ప్రకటించినట్లుగా 2 లక్షల రుణమాఫీ, ఎకరానికి 15 వేల రూపాయల రైతుభరోసా, అన్ని పంటలకు బోనస్,కౌలు రైతులకు కూడా రైతు భరోసాను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. దేవుళ్ళ సాక్షిగా మీరు ప్రమాణం చేసి మాట ఇచ్చారు. కానీ 420 రోజులు పూర్తైనా ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేద” ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *