హుస్నాబాద్ లో ప్లాస్టిక్ వినియోగించిన దుకాణాలకు జరిమానా

హుస్నాబాద్ లో ప్లాస్టిక్ వినియోగించిన దుకాణాలకు జరిమానా

హుస్నాబాద్ పట్టణంలో ప్లాస్టిక్ వినియోగించిన హోటల్, బేకరీలకు జరిమానా విధించిన మున్సిపాలిటీ అధికారులు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం ఆధ్వర్యంలో గురువారం మున్సిపాలిటీ అధికారులు పలు హోటల్ లో, బేకరీలలో ప్లాస్టిక్ వినియోగంపై ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 7 షాపులకు జరిమానా విధించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడిన షాపులకు గోవా బేకరీ 2000/-, హోటల్ దుర్గా రెస్టారెంట్ 500/-, రుషి బిర్యానీ పాయింట్ 500/-, వీనస్ మెస్ 500/-, శ్రీ సాయి బెంగళూరు బేకరీ 2000/-, న్యూ బావర్చి బిర్యానీ పాయింట్ 500/-, లక్ష్మీ జనరల్ స్టోర్స్ 2000/- ల జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో వనమహోత్సవ సూపర్వైజర్ శంకర్, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్స్ సువార్త, మమత, సాంబరాజు, ఎల్లయ్య మరియు జవన్ సారయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *