హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ సీటు సాధించిన ప్రతి ఒక్కరి ఫీజులు చెల్లిస్తా..

హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ సీటు సాధించిన ప్రతి ఒక్కరి ఫీజులు చెల్లిస్తా..

హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించిన ప్రతి ఒక్కరి ఫీజులు చెల్లిస్తా..

అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలి

బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడింది – మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,జూన్23:

హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గాంధీనగర్  లో భారతరత్న డా,,బి.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు..మాణిక్యపూర్ నుండి గాంధీ నగర్ వరకు భారీ ర్యాలీతో అంబేద్కర్ సంఘం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రలో పాల్గొన్నారు.. మాణిక్య పూర్ అంబేద్కర్ సంఘం జై భీమ్ సభ్యులతో కలిసి డప్పు కొట్టి అందరిలో ఉత్సాహాన్ని నింపారు.  గాంధీనగర్ అంబేద్కర్ సంఘం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన డా,, బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహవిష్కరణ చేశారు..

అనంతరం బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామ ప్రజలకు  శుభాకాంక్షలు తెలిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడేటప్పుడు ఆంధ్ర వాళ్లంతా వ్యతిరేకించిన  ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఇదే రాజ్యాంగానికి ఉన్న గొప్ప లక్షణమని కీర్తించారు.

రాజ్యాంగం రక్షించుకుంటేనే మన భవిష్యత్ పిల్లల భవిష్యత్ నిర్మాణాత్మకంగా చేసుకోవచ్చనీ సూచించారు. రాజ్యాంగం ఎప్పటికీ ఓడిపోదని శాశ్వతంగా నిల్చి ఉంటుందని కొంతమంది మతం పేరు మిద రాజ్యాంగం పై దాడి జరిగే కుట్ర జరుగుతోందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని మంత్రి పొన్నం సూచించారు. తాను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, Nsui నాయకుడిగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా మణిక్యాపూర్ గాంధీ నగర్ లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ శాశ్వతంగా గుర్తు ఉండేలా తను ఒక నిర్ణయం తీసుకుంటున్న అని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి  ప్రభుత్వ మెడికల్ కాలేజి లో సీట్లు సాధిస్తారో వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించే డబ్బులు తానే చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తన తల్లిదండ్రులకు చదువు రాకున్న ధైర్యంగా చదువుకొని మీ ముందు నిలబడి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు మీ ముందున్న అని తెలిపారు.

తల్లిదండ్రులు మానిక్యాపూర్ గాంధీ నగర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ వేదిక నుండి మీ పిల్లల్నీ మంచిగా చదివించాలని వేడుకున్నారు. ఒక పూట తిన్న తినకపోయినా పిల్లలు స్కూల్ నుండి రాగానే సీరియల్ లు బంద్ చేసి పిల్లల చదువుకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

తమ ప్రభుత్వం విద్యా, వైద్యం కి తొలి ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న  25 వేల స్కూల్ లకి 11 వందల కోట్లతో తాగు నీరు, విద్యుత్,  బాత్రూమ్, బడికి కలర్లు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కూల్ లలో కొత్తధనం కనిపిస్తున్నాయన్నారు.గత 10 సంవత్సరాలు గా టీచర్ల నియామక జరగలేదు. ఇప్పుడు మెగా డీఎస్సీ వేసి టీచర్ల నియామకాలు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని ఉద్యమ నాయకుడిగా తనకు అవకాశం ఇచ్చారని మీ అందరి ఆశీర్వాదంతో అభివృద్ధిలో ముందుకు పోతున్న అని తెలిపారు.

గౌరవెల్లి ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి నీళ్ళు అందించేందుకు వేగంగా ముందుకు పోతున్నామని, రేపు హుస్నాబాద్ నియోజకవర్గంలో జీరో నుండి పీజీ వరకు తిరుమల గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులు అందరూ ఈ జాబ్ మేళా ను ఉపయోగించుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళా లో విదేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మంచి జీతంతో వచ్చే ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు.

నియోజకవర్గంలో విద్యా , వైద్యం ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆలోచనలతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నమని డా,, బి. ఆర్ .అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మనమంతా ఆచరిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఉద్యమ గాయకుడు ఏపూరి సోమన్న ,రెంజర్ల రాజేష్ , ఇతర అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *