హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

100 రోజుల ప్రణాళికలో భాగంగా ఘనంగా నిర్వహించిన మెప్మా ఫెస్టివల్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, జూలై 30:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో బుధవారం రోజు మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలకు ప్రత్యేక ఫెస్టివల్ నిర్వహించబడింది. ఈ వేడుకలు హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయి. మహిళా సంఘాల సభ్యులు తాము తయారుచేసిన వివిధ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ఉత్పత్తుల్లో: తినుబండారాలు, పిండివంటలు, మొక్క పిండితో తయారుచేసిన ప్లేట్లు, కప్స్, కూరగాయలు, గాజులు, బట్టలు, డ్రెస్ మెటీరియల్స్, తదితర వస్తువులు విస్తృతంగా ప్రదర్శింపబడ్డాయి.


ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ –> “పట్టణ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి ఇందిరా మహిళా శక్తి, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి వంటి పథకాల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నాం. ఈ ఏడాది హుస్నాబాద్ పట్టణంలోని మొత్తం 503 సంఘాల్లో, 23 సంఘాలకు రూ.2 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది,” అని తెలిపారు. అలాగే, మహిళలు స్వయం ఉపాధికి దోహదపడే విధంగా అన్ని రంగాల్లో ముందుండి ఆర్థికంగా ఎదగాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా మహిళలు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ, స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేస్తుండటం అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. పట్టణ అభివృద్ధిలో మహిళల పాత్ర మరింత బలపడేలా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎడిఎంసీ సంతోషిమాత, మేనేజర్ సంపత్, మున్సిపల్ సిబ్బంది, ఆర్‌పీలు ఓబిలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొని ఫెస్టివల్‌ను విజయవంతం చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *