కెసిఆర్ పై ఈడీ కేసు నమోదు చేసింది..
త్వరలో.. హరీష్ రావు, వెంకట్రామ్ రెడ్డి పై ఈడి ఎఫెక్ట్..
మెదక్ నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటా..
పార్టీ నాయకులు కార్యకర్తలు నాగెలుపుకోసం కష్టపడ్డారు..
మెదక్ పార్లమెంటులో సమస్యలు పరిష్కారిస్తా..
-ఎంపీ రఘునందన్ రావు..

సిద్దిపేట టైమ్స్: మెదక్ ప్రత్యేక ప్రతినిధి
మాజీ సీఎం చంద్రశేఖర రావు మీద ఈడీ ఇప్పుడే కేసునమోదుచేసిందని, త్వరలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ, బిఅర్ఎస్ ఎంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డిల పై ఈడీ ఎఫెక్ట్ ఉంటుందనీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి ఇంకొకడు వస్తాడు అని ఏనాడు అయిన హరీష్ రావు
కలగన్నాడా.. రఘునందన్ గేలిస్తే మా పేరు ఢిల్లీ దాక వినబడుతుంది అని బూతు అధ్యక్షులు, శక్తికేంద్రాల అధ్యక్షులు బిజెపి కార్యకర్తలు, నాయకులు
నా గెలుపు కోసం కష్టపడ్డారు. వారికి, మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని రఘునందన్ రావు అన్నారు. గురువారం మెదక్ సాయిబాలాజీ గార్డెన్ లో
విజయోత్సవ సభ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పార్లమెంట్ ఎన్నికలలో డబ్బుతో గెలవలేము అని నిరూపించాము అని అన్నారు. ఎంపి ఎన్నికల్లో 500 కోట్లు ఖర్చుపెట్టిన వెంకటరామిరెడ్డి గెలవలేదు అన్నారు. మెదక్ పార్లమెంటు గెలిచి మోదికి గిఫ్ట్ ఇచ్చo అన్నారు. ప్రతి సమస్యను భారత పార్లమెంట్ లో వినిపిస్తనని రఘునందన్ మాటల మనిషి కాదు చేతల మనిషి అని నిరూపిస్తా అన్నారు. మెదక్ మున్సిపాలిటీ, స్థానిక సంస్థలలో బిజెపి జెండా ఎగరాలి విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. అజంతా, రాయలసీమ ఎక్స్ప్రెస్ లు అక్కన్నపేట, చెగుంటలో ఆపే విధంగా సౌత్ రైల్వే జిఎంకు విన్నవిస్త అన్నారు.
మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావడంలో నేను ఒక్కడిని కావడం సంతోషం ఉందన్నారు. వెంకట్రామిరెడ్డి లక్షకోట్లకు అధిపతి
లక్ష కోట్లున్న వెంకటరామిరెడ్డి కి ఎంత విలువ ఉంటదో పూటకు బువ్వ లేనటువంటి బిజెపి కార్యకర్తకు కూడా మా పార్టీలో అంతే విలువ ఉంటుంది అన్నారు..
ఆలయాల్లో ప్రత్యేక పూజలు…

ఎంపి గా గెలిచిన తర్వాత మొదటి సారి మెదక్ వచ్చిన ఎంపీ రఘునందన్ రావు మెదక్ పట్టణంలోని పంచముఖి ఆంజనేయ ముత్తయికోట సిద్ధిరామేశ్వరా, కుచన్ పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ద్విచక్ర వాహన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర ఆలయం కుచన్ పల్లి నుండి ప్రారంభించడం జరిగింది అన్నారు. గెలిచిన తర్వాత మొక్కిన మొక్కును శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని తీర్చుకున్న అని చెప్పారు.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మెదక్ నియోజక వర్గ ప్రజలు వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్న నని తెలిపారు. నరేంద్రుడి పాలనలో నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తా అన్నారు. ఎక్స్టెన్షన్ రైల్వే, ట్రైన్స్ సమయాల్లో మార్పు విషయంలో మార్పు తీసుకువస్త అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





