అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు
గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు చాలా ప్రమాదకరం భవిష్యత్తును అందాకారములోకి నెట్టివేస్తాయి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి మానవ తప్పిదం వల్ల సైబర్ నేరాలు జరుగుతున్నాయి
విద్యార్థి దశలో చదువుపై శ్రద్ధ ఉంచాలి..ఇష్టపడి చదివి పై స్థాయికి వెళ్ళాలి
చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తుంచుకోవాలి
హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలోని మీర్జాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీ టీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీ టీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి హుస్నాబాద్ ఎస్ఐ తోటమహేష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడుతూ… ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దని, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుందన్నారు, మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత అని చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దు అని తెలిపారు. విద్యార్థి దశ చాలా కీలకమైనదని కష్టపడే తత్వం అలవాటు చేసుకుని చదువుకోవడం చాలా ముఖ్యమని మరియు నూతన చట్టాల గురించి నూతన చట్టాలలో మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ ఏఎస్ఐ మల్లేశం, హుస్నాబాద్ షీటీమ్ బృందం సదయ్య , హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుళ్లు స్వప్న, ప్రశాంతి, కానిస్టేబుళ్లు కృష్ణ, శివకుమార్, స్కూల్ హెడ్మాస్టర్ వేణు, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.