యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు

బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దు

తాత్కాలిక ఆనందం కొరకు నిండు జీవితాన్ని కోల్పోవద్దు

చదివించడానికి తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి

హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని సివి రామన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు బుధవారం  హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్  మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన సూచించారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో వుందని ఈ ప్రమాదం భారిన పడకుండా యువత అప్రమత్తంగా వుండాలని కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాల సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఓ కలగానే మిగిలి పోతుందని, కొంత మంది వ్యక్తులు తమ డబ్బు సంపాదన కోసం గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు విక్రయాలకు పాల్పడి యువతకు అందించడం జరుగుతోందని, ఇలాంటి స్వార్థపరుల చేతుల్లో యువత బలికావద్దని, ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకై ఎదురుచూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు.

ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించాలని, మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయని యువత గ్రహించాలని, అలాగే మీ తోటి మిత్రులు గంజాయిని సేవిస్తున్నట్లయితే మత్తు పదార్థాల వినియోగం ద్వారా నష్టాలపై వారి అవగాహన కల్పించాలని, ప్రధానంగా గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం ప్రత్యేక చోరవ చూపిస్తోందని, ఇందులో భాగంగా సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గంజాయి నియంత్రణకై డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నా, రవాణా, విక్రయాలు పాల్పడుతున్నా వారిని పట్టుకోవడే ఈ విభాగం ప్రత్యేకతని, ఎవరైన మత్తు పదార్థాలు అమ్మినా,  సేవించినా డయల్ 100,  సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. పెద్దఎత్తున గంజాయి సమచారం అందించిన వారికి నగదు పురస్కారం కూడా అందజేయబడుతుందని, గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. అనంతరం గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు  వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్  మరియు అధ్యాపకులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *