బాలికల పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ

బాలికల పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ

బాలికల పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ

మానవత్వం చాటుకున్న ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ జిల్లాపరిషత్ బాలికల ఉన్నతపాఠశాలలో విద్యార్థిని & విద్యార్థులు త్రాగునీటి కి ఇబ్బందిపడుతున్న విషయంను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సింగసారం వెంకటయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత మరియు స్థానిక కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ల ద్రుష్టికి తీసుకొని రాగా మిత్ర మండలి 87 సభ్యులు ఒంటెల కృష్ణ, బూట్ల రాజమల్లు మిత్ర మండలి సహకారంతో సమస్యను అల్ల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి సహకారంతో మిత్ర మండలి 87 ఆధ్వర్యంలో ఈరోజు పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను నరేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంనకు ముఖ్య అతిధిగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత హాజరై మాట్లాడ్తు పాఠశాల పేద విద్యార్థుల త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషిచేసిన మిత్ర మండలి మరియు నరేందర్ రెడ్డిల ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సౌకర్యాల కల్పన కోసం మరిన్ని సహాయసహకారాలు అందించాలని రజిత కోరారు.

అల్ల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉత్తమమైన ఉన్నత విద్యబ్యాసం కోసం సేవ చేసేందుకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో వుంటానని పేర్కొన్నారు. స్థానిక కౌన్సిలర్ & మిత్ర మండలి ప్రధాన కార్యదర్శి దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల త్రాగునీటి ఇబ్బందిని ఇటీవల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య విద్యార్థులకు ఏకరూప దుస్తులు & పాఠ్యపుస్తకాల పంపిణి సందర్బంగా మా ద్రుష్టికి తీసుకొని రాగానే నేను మరియు వైస్ చైర్మన్ ఐలేని అనిత మా ఎస్ఎస్సి బ్యాచ్ సభ్యుల దృష్టిలో పెట్టగానే స్పందించిన మిత్రులు ఒంటెల కృష్ణ, అధ్యక్షులు బూట్ల రాజమల్లు, పెరుమాళ్ళ శ్రీనివాస్, నిరుమల రవీందర్, రాజేంద్ర ప్రసాద్ ల బృందంతో కలిసి నరేందర్ రెడ్డి సహకారం అందించాలని కోరగానే వారు ప్లాంట్ కోసం 25000/- ఆర్థిక సహకారం అందించి విద్యార్థుల దాహర్తి తీర్చటం కోసం సహకారం అందించిన నరేందర్ రెడ్డి కి పాఠశాల విద్యార్థుల మరియు మిత్ర మండలి పక్షాన ధన్యవాదములు తెలిపారు. అనంతరం చైర్మన్ ఆకుల రజిత, నరేందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య లను మిత్ర మండలి పక్షాన ఘనంగా సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి సభ్యులు పెరుమాళ్ళ శ్రీనివాస్, గుండోజు రాజేంద్ర ప్రసాద్, మాదిశెట్టి శ్రీనివాస్, రాజేశ్వర్ రెడ్డి, తోడేటి శ్రీనివాస్, రాజయ్య, మోహన్, నిరుమాళ్ళ రవీందర్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *