సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ లో వరదరాజుపల్లి గ్రామస్థుల ధర్నా..
సమస్య వినకుండ కమీషనర్ దురుసుగా ప్రవర్తించాడని ధర్న..

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ఆగస్టు 22
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ లో వరదరాజుపల్లి, గుడికందుల, గోవర్థనగిరి గ్రామస్థుల ధర్నా.. కమీషనర్ డౌన్.. డౌన్.., దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం అంటు నినాదాలు.. కమీషనర్ చాంబర్ ముందు బైఠాయించి ఆయా గ్రామాల ప్రజలు శుక్రవారం నిరసన తెలిపారు.. వరదరాజుపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సిద్దిపేట డంపుయార్డుతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, చెరువులో చెత్త వేయడంతో చేపలు మృతి చెందాయని ఈ సమస్య విన్నవించడానికి వచ్చిన గ్రామస్తులతో కమీషనర్ దురుసుగా ప్రవర్తించాడని.. సమస్య వినకుండా మీరు ఏంచేసుకుంటారో చేసుకోండని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఆగ్రహించి కమీషనర్ చాంబర్ ముందే భైటాయించి ధర్న చేశారు. తమ సమస్య చెప్పడానికి వస్తే కమీషనర్. తన చాంబర్ లోనికి రానివ్వకుండా తన సిబ్బందితో తోపించాడని, కమీషనర్ దురుసు సమాధానం ఏంచేసుకుంటారో చేసుకోండి అని చేప్పడం వారిని తీవ్ర ఆవేధనకు గురి చేసింది. ఇది పోను కమీషనర్ వ్యవహరించిన తీరు తో కమిషనర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య ను ఎంపి రఘునందన్ రావు దృష్టికి తీసుకువేల్లగా స్పందించి కమీషనర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని తెలపడంతో వారు మున్సిపల్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. గ్రామస్తులకు కమీషనర్ వ్యవహరంచిన తీరుతో కంగుతిన్నారు.. తన చాంబర్ లో కి రవద్దని సిబ్బందితో అడ్డుకోవడం.. ఎంచేసుకుంటారో చేసుకోండి అనడం ధర్నాకు దారితీసింది. చివరకు కమీషనర్ దిగివచ్చి వినతి పత్రం స్వీకరించారు.








