కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది…బొమ్మ శ్రీరామ్

కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది…బొమ్మ శ్రీరామ్

కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది

రాష్ట్రంలోనే రైతు రుణమాఫీలో హుస్నాబాద్ ద్వితీయ స్థానం

రైతుల సంక్షేమానికి రేవంత్ సర్కార్ పెద్దపీట

రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీతో తెలంగాణ రైతులందరూ పండగ చేసుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం సంతోషకరమని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోనే రైతు రుణమాఫీలో హుస్నాబాద్ ద్వితీయ స్థానంలో నిలిపినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. కెసిఆర్ రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను గత పాలకులు ఇష్టానుసారంగా రూపాయలు 7,000 కోట్లు అప్పులు తెచ్చి ఖజానా ఖాళీ చేశారన్నారు. అప్పులకు వడ్డీ చెల్లించడమే కష్టంగా ఉందని అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే లక్ష్యంగా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా భూమి పాసుబుక్ ఉన్న ప్రతి రైతుకు పంట రుణాలు మాఫీ చేస్తున్నారన్నారు మొదటి విడుదల లక్ష లోపు రుణాలు ఈనెల ఆఖరిలో రూ.1 లక్ష 50 వేల రూపాయల లోపు రుణాలు, ఆగస్టు మాసంలో రూపాయలు రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నారని తెలిపారు. 69 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరుగుతుందన్నారు. చేతగాని వాడు పనిచేయలేని వాడు విమర్శిస్తూనే ఉంటాడు. ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. గత ప్రభుత్వం కూడా రుణమాఫీ పై హామీ ఇచ్చింది కానీ ఐదు సంవత్సరాలైనా కూడా తీర్చలేదు అన్నారు.రాష్ట్రంలోనే హుస్నాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచింది. లక్ష రూపాయలు రుణమాఫీ అమలు అయినా వాటిలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 18907 ఖాతాలల్లో 18101 కుటుంబాలకు రూ.  106 కోట్ల 74 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది.

కేసీఆర్ హయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిన రైతుల సంక్షేమం కోసం సిఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నప్పటికీ రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీతో పండగ జరుపుకుంటున్న రైతులందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *