నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”

నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”

నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”

ఎలాంటి పేపర్లు లేని 15 మోటార్ సైకిళ్ళు, 5 ఆటోలు సీజ్

నార్కటిక్స్ డాగ్స్ తో అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి

స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

నూతన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో హుస్నాబాద్ ఏసిపి సతీష్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం రోడ్డులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ కాలనీలో హుస్నాబాద్ ఏసిపి సతీష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీ ప్రజలకు రక్షణ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవలసిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ ఏసిపి వి. సతీష్, మాట్లాడుతూ….. ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, పట్టణాలలో కాలనీలో గ్రామంలో  ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని,  కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరియు సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల జూలై 1 నుండి భారతదేశ వ్యాప్తంగా నూతన చట్టాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ చట్టాలలో నేరం చేసిన నేరస్తులకు కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా మహిళల రక్షణకు చట్టాలు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. నూతన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ టీఎస్ కాప్ అధునాతన యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నషన్ సిస్టం ద్వారా అనుమానితుల ఫోటో తీసి చెక్ చేయడం ద్వారా  ఎవరైనా పాత నేరస్తులు నేరం చేసి ఉంటే వెంటనే వారి ఫోటో వారి బయోడేటా వారు చేసిన నేరం వివరాలు క్షణంలోనే తెలిసిపోతాయి పాత నేరస్తుల ఫోటోలు తీసి మరియు ఫింగర్ ప్రింట్ ద్వారా చెక్ చేయడం జరిగిందని తెలిపినారు నేను సైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చు, మరియు గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని తెలిపారు. సీజ్ చేసిన వాహనాల సంబంధించిన పత్రాలు చూపించి తీసుకొని వెళ్ళవచ్చు, లిక్కర్ మరియు గుట్కాలపై  కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు,ఎలాంటి పత్రాలు లేని వాహనాలు  నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా భావించి ధరించాలని సూచించారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని తెలిపినారు. ఈ రోజు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని. కాలనీలో ఎవరైనా  అనుమానస్పదంగా తిరుగుతూ తిరుగుతున్న మరియు గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి గుట్కాలు అమ్ముతున్నా కలిగి ఉన్న వారి సమాచారం తెలిస్తే  వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని  లేద డయల్ 100 కాల్ కు  ఫోన్  చేసినాచో  వెంటనే చర్యలు చేపడతాం అని యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మరియు వారి ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలను రక్షించడానికే తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు. ఎలాంటి పరిచయ లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని తెలిపినారు. సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు సంబంధించిన వివరాలు, ఓటిపి తదితర నెంబర్లు ఎవరికీ తెలియపరచ కూడదు వాట్స్అప్ లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకూడదు సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 1930 డయల్ 100, కాల్ చేయండి తదితర అంశాల గురించి గ్రామస్తులకు తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేష్, కోహెడ ఎస్ఐ అభిలాష్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్,  మరియు సర్కిల్ పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
           

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *