సహకార సంఘాలు నా రాజకీయాలకు తొలిమెట్టు

సహకార సంఘాలు నా రాజకీయాలకు తొలిమెట్టు

సహకార సంఘాలు నా రాజకీయాలకు తొలిమెట్టు

బొప్పరాజు లక్ష్మీకాంతరావు మనందరికీ ఆదర్శ మూర్తి

చౌటుపల్లి ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చుతా

హుస్నాబాద్ సహకార సంఘాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా

నూతన సహకార సంఘ కార్యాలయ భవనం ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో “ది హుస్నాబాద్ విశాల సహకార పరపతి సంఘం లి.” నూతన సంఘ కార్యాలయ భవనం, 1200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నూతనంగా నిర్మించిన గోదాం లను మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్, సహకార సంఘాల అభివృద్ధి చైర్మన్ మానాల మోహన్ ఇతర ముఖ్య నేతలు కలిసి ప్రారంభించారు. అనంతరం ది విశాల సహకార పరపతి సంఘం ప్రాంగణంలో సంఘ వ్యవస్థాపకులు బొప్పరాజు లక్ష్మీకాంత రావు విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… భారత తొలి ప్రధాని నెహ్రూ జయంతి సందర్భంగా వారం రోజులపాటు సహకార సంఘ వారోత్సవాలు జరుగుతాయని, సహకార సంఘాలు నా రాజకీయాల్లో తొలిమెట్టు అని, హుస్నాబాద్ సహకార వ్యవస్థాపకులు మాజీ శాసన సభ్యులు మాజీ సర్పంచ్ మనందరికీ ఆదర్శ మూర్తి బొప్పరాజు లక్ష్మీకాంతరావు అని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి గా ఉండాలని ఈరోజు బొప్పరాజు లక్ష్మీకాంతరావు విగ్రహం ఆవిష్కరించుకున్నం అని, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నన్ను మార్క్ ఫెడ్ చైర్మన్ చేశారు కానీ
అప్పుడు సహకార సంఘాల సభ్యులను నమ్మే పరిస్థితి లేదు అయినా కూడా 5 సంవత్సరాల కాల పరిమితి లో మూడున్నరెళ్లలనే మార్క్ ఫెడ్ సంస్థలో పొన్నం ప్రభాకర్ పేరు ఉండేలా పని చేశానని అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా అయినా, క్రిబ్కో డైరెక్టర్ గా ఉన్న కూడా రైతుల పక్షాన ముందుకు పోతున్న వెళ్తున్నానని, సహకార రంగంలో రైతు బిడ్డగా మార్క్ ఫెడ్ చైర్మన్ అయిన తర్వాత ఊరూరా కోనుగోలు  కేంద్రాలు ఉండేలా ఏర్పాటు చేశానని, సహకార సంఘాల అభివృద్ధికి తొడ్పడతానన్నారు.

అక్కన్నపేట మండలం నాయకుల ప్రతిపాదన మేరకు అక్కడ పరిశ్రమలు పెట్టలనుకున్నం, దౌర్జన్యంగా వ్యవహరించకుండా మీ అందరి సహకారంతో అక్కడ పరిశ్రమలు పెట్టి చౌటుపల్లి ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చుతానన్నారు, రైతు ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలైన సీడ్ ప్రాసేసింగ్ యూనిట్స్, రైస్ మిల్స్ అగ్రికల్చరల్ కి సంబంధించివి మాత్రమే ఏర్పాటు చేస్తామని అన్నారు. హుస్నాబాద్ సహకార సంఘాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తానని, ఈ సొసైటీ ద్వారా 504 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది అని ఇంకా 204 మందికి రుణమాఫీ జరగల్సి ఉందన్నారు. త్వరలో వారికి కూడా రుణమాఫీ జరిగే విధంగా కృషి చేస్తామని అన్నారు.

ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి వచ్చాను అందరూ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు.. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవం పెంచేలా చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానన్నారు, బొప్పారాజు లక్ష్మీకాంతరావు సర్పంచ్ గా మూడు సార్లు ఎమ్మెల్యేగా, హుస్నాబాద్ తొలి శాసన సభ్యులుగా వెంకట్ రెడ్డి, చొక్కరావు, బొప్పరాజు, దేశీని చిన్న మల్లయ్య, బొమ్మా వెంకన్న, చాడ వెంకట్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి లు ఈ ప్రాంత అభివృద్ధి కి పాటుపడ్డారని,
బోప్పరాజు లక్ష్మీకాంత రావు, దేశిని చిన్న మల్లయ్య, బొమ్మ వెంకన్న విగ్రహాలను నాగారం చౌరస్తా లో ఏర్పాటు చేస్తామన్నారు. బోప్పరాజు లక్ష్మీకాంత రావు నివాసాన్ని అందరికీ ఉపయోగపడేలా చేస్తాం. చరిత్రను మర్చిపోతే భవిష్యత్ మనల్ని కూడా మార్చిపోతుంది.. రాజకీయాలకు ఎవరు శాశ్వతం కాదని, చరిత్రలో మనం కూడా ఉండేలా ప్రయత్నం చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు కి కూడా ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురండి రాజకీయాలకు అతీతంగా పని చేద్దామని చెప్పానన్నారు.

ఈ కార్యక్రమంలో ములకనూరు సహకార బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, జిల్లా సహకార సంఘ అధ్యక్షులు కొండూరి రవీందర్, తెలంగాణ కోపరెటీవ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్, సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు ఇతర అధికారులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *