స్వచ్ఛతలో హుస్నాబాద్ మున్సిపల్‌కు ఛేంజ్ మేకర్స్ అవార్డు

స్వచ్ఛతలో హుస్నాబాద్ మున్సిపల్‌కు ఛేంజ్ మేకర్స్ అవార్డు

స్వచ్ఛతలో హుస్నాబాద్ మున్సిపల్‌కు ఛేంజ్ మేకర్స్ అవార్డు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా సిటీ సాలిడ్ వేస్ట్ యాక్షన్ ప్లాన్ అమలులో హుస్నాబాద్ మున్సిపాలిటీ సత్ఫలితాలను సాధించింది. అందుకుగాను స్వచ్ఛతలో హుస్నాబాద్ మున్సిపల్ కు ఛేంజ్ మేకర్స్ అవార్డు దక్కిందని కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. 2021 నుండి 2024 వరకు స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ప్రదర్శన, చెత్తతో నూతన వస్తువులు తయారు చేయడం మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ కార్యక్రమాలు మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన మున్సిపాలిటీలకు CSE మరియు MoHUA సంయుక్తంగా ఢిల్లీలో డిసెంబర్ 19 న సిల్వర్ హోక్ హాల్ లో ఏర్పాటు చేసిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో డా. సునీత నరైన్(CSE డైరెక్టర్) చేతుల మీదుగా  చేంజ్ మేకర్ అవార్డు ను హుస్నాబాద్ పురపాలక సంఘ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ డి రవికుమార్ అందుకున్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *