ఈనాడు చైర్మన్ రామోజీరావు కన్నుమూత..
సిద్దిపేట టైమ్స్, బ్యూరో
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత “చెరుకూరి రామోజీరావు” (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4.50 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.