అక్బరుపేట సబ్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్.. తప్పిన అగ్నిప్రమాదం
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పాలశీతలీకరణ కేంద్రం సందర్శన
హుస్నాబాద్ లో ప్రారంభమైన “స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్” ఆరోగ్య శిబిరం
పేదలకు భూములు పంచిన ఘనత కమ్యూనిస్టులదే
ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శ్రమదానం, స్వచ్ఛత ర్యాలీ
కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..
కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు..
వృద్ధ దంపతులకు గాయాలు..

సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:

నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలో పాత పెంకుటిల్లు ఇల్లు కూలిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే వారిని బయటకు తీసి అంబులెన్స్ సాయంతో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా కురుస్తున్న వర్షాల వలన ఇల్లు గోడలు బలహీనపడి తెల్లవారుజామున కూలిపోయాయి.దాంతో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కేకలు విని మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.వైద్యులు తెలిపిన ప్రకారం బాధితులకు సాధారణ రక్త గాయాలే ఉన్నాయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఇదే సమయంలో అధికారులు వర్షాల ప్రభావంతో బలహీనంగా మారిన పాత ఇళ్ళను గుర్తించి, నివాసులను అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రం తెలిపారు.













