మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తులు మారాలి

శనిగరం ప్రాజెక్టును పునరుద్ధరణ, టూరిజం అభివృద్ధి చేస్తాం

రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట ప్రత్యేక ప్రతినిధి:

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం శనిగరం రిజర్వాయర్ లో వంద శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనిగరం ప్రాజెక్ట్ లో పూజలు చేసి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరితో కలిసి శనివారం చేప పిల్లలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జి పూజల హరికృష్ణ,శంకర్ రాథోడ్ రాష్ట్ర మత్స్య శాఖ అడిషనల్ డెరైక్టర్, సిద్దిపేట ఫిషరీస్ అధికారులు, ఈఎన్సి, సిద్ధిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో, నియోజకవర్గ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు మరింత న్యాయం చేయాలని ఆర్థికంగా ఎదగాలని చేప పిల్లల పంపిణీ గతానికి మించి చేస్తున్నామన్నారు. గతంలో చేప పిల్లల పంపిణీ చేయడానికి పాత పేమెంట్ కొంత ఇబ్బంది పడ్డారుని, అవి క్లియర్ చేస్తామన్నారు. చేప పిల్లల పంపిణీ దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు. గంగపుత్ర ముదిరాజులు ఆర్థికంగా ఎదగడానికి ఇది కుల వృత్తని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో మత్స్య సహకార సంఘాలు ఉన్నవాటికి పరిమితం కాకుండా నీటి నిల్వలు ఉన్న దగ్గర కూడా చేప పిల్లలు విడుదల చేయాలని కలెక్టర్ ను కోరుతున్నట్లు చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి చెరువులో చేప పిల్లలు విడుదల చేసుకునే బాధ్యత మీదేనన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి కుల వృత్తులు మారాలని ఆకాంక్షించారు. మత్స్య శాఖకు సంబంధించి మొబైల్ మార్కెట్ లు అమ్ముకోవడానికి మౌలిక వసతులు తదితర వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో  శనిగరం దగ్గర ప్రభుత్వ స్థలంలో ఫిష్ మార్కెట్ పెడతామని, ఆర్డీవో స్థల సేకరణ చేయాలని సూచించారు. హైదరాబాద్ కు పోయే వారు ఇక్కడ చేపలు కొనుక్కొని పోయేలా అభివృద్ధి జరగాలని అన్నారు. శనిగరం గెస్ట్ హౌజ్ పునరుద్ధరణ చేస్తామన్నారు. ఇక్కడ టూరిజం అభివృద్ధి చేస్తాని చెప్పారు. ఫిష్ పాండ్ ను పునరుద్ధరణ చేయాలని, దానిని ఆక్టివ్ చేయాలన్నారు. మత్స్య సంపద, పశు పోషణ, పాలు, కోళ్ళుపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ఆయిల్ ఫాం, డ్రాగన్ ఫ్రూట్, చేపల చెరువు, కోళ్ళు పెంపకం, ఆవులు, గేదెల పెంపకంపై రైతు వేదికల వద్ద అవగాహన కల్పిస్తున్నామన్నారు. బ్యాంకర్లతో కూడా మీటింగ్ లు పెట్టీ లోన్లకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ద్వారా కుల వృత్తుల ద్వారా మోడీపికేశన్ ట్రైనింగ్ ఇచ్చి  మారుతున్న కాలానికి అనుగుణంగా మారేలా శిక్షణ ఇస్తామని అన్నారు. కాలువల ద్వారా ప్రతి గ్రామంలో నీళ్ళు అందిస్తామని, అది అందరి ఆకాంక్షగా ఉండన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించిన తరువాత గత ప్రభుత్వంలో జాప్యం జరిగిందని, ఇప్పుడు ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసి, కాలువల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. డబుల్ రోడ్లు పూర్తి అయిన దగ్గర అవెన్యూ ప్లాంటేషన్ కింద ఇరువైపులా చెట్లు నాటలన్నారు. విదేశాల్లో లక్షల్లో జీతాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ వీసా ఇచ్చి పంపించే కార్యక్రమం చేపడతామని అన్నారు. త్వరలోనే టాంకాం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *