జిల్లా కేంద్రానికి, పుణ్య క్షేత్రాలకు హుస్నాబాద్ డిపో బస్సులను నడిపించాలి

జిల్లా కేంద్రానికి, పుణ్య క్షేత్రాలకు హుస్నాబాద్ డిపో బస్సులను నడిపించాలి

జిల్లా కేంద్రానికి, పుణ్య క్షేత్రాలకు హుస్నాబాద్ డిపో బస్సులను నడిపించాలి

హుస్నాబాద్ డిపో లో బస్ ల సంఖ్య పెంచాలి.

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా కేంద్రానికి, హన్మకొండ కు మరియు పుణ్యక్షేత్రాలకు హుస్నాబాద్ డిపో ఆర్టీసీ బస్ లను నడిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమతి తీసుకు వచ్చేందుకు కృషీ చేయలని కోరుతూ  సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యం లో హుస్నాబాద్ ఆర్టీసీ డిపో సూపర్ డెంట్ శ్రీధర్ మరియు యస్టీఐ మురళీ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షుడు అన్వర్ మాట్లాడుతూ గతంలో కరీంనగర్ జిల్లా లో ఉండే హుస్నాబాద్ ఇప్పుడు సిద్దిపేట లో కలిసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి పోవాలంటే తగిన సమయంలో బస్సులో అందుబాటులో ఉండడం లేదని, సిద్ధిపేట మరియు హనుమకొండ వెళ్లే ప్రయాణికులలో ఎక్కువ మొత్తం మన ప్రాంతం వారు కానీ ఆదాయం మాత్రం సిద్ధిపేట, హనుమకొండ డిపోలకు పోతుందని కావున మన డిపో బస్ లు అ రెండు రూట్లులో నడిపితే మన డిపో కు ఆదాయం ఎక్కువ సమకూరుతుందని మరియు ఈ ప్రాంత ప్రజలకు బస్ లు అందుబాటు లో ఉంటాయన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర లో ఉన్న పుణ్య క్షేత్రాలకు ఈ ప్రాంత ప్రజలు వెళ్లాలంటే బస్ లు లేక ఇబ్బందులు పడుతున్నారు అందుకోసం హుస్నాబాద్ అర్ టి సి డిపో నుండి పుణ్య క్షేత్రాలకు బస్ లు నడిపించాలని, ఆర్టీసీ డిపో లో బస్ ల సంఖ్య పెంచి మన ప్రాంతం లోని ప్రతి పల్లె కు బస్ లు నడిపించే విదంగా మంత్రి కృషీ చేయలని, డిపో చుట్టు ప్రహరి గోడ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కొంత భాగం కూలడం తో దానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా నాయకులు సుద్దాల  చంద్రయ్య, అయిలేని మల్లిఖార్జున్ రెడ్డీ, సురంపెళ్లి పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *