కార్యకర్తలకు అండగా BRS పార్టీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు అన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మిడుదుల కొమురుమల్లు ప్రమాదవశాత్తూ మరణించగా BRS పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల విలువైన చెక్కును నామినీ గా ఉన్న ఆయన కుమారుడు కొమురయ్య భార్య కొమురవ్వ కి చెక్కును మాజీ శాసన సభ్యులు శ్రీ వొడితల సతీష్ కుమార్ అందజేశారు. వారి వెంట ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
