భువనగిరి జిల్లాకు బెల్లి లలితక్క పేరు పెట్టాలి
హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్
ఆదివారం రోజున సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో తెలంగాణ గాన కోకిల, మలిదశ తెలంగాణ ఉద్యమ అమరురాలు, లేడి గద్దర్ బెల్లి లలితక్క 25వ వర్ధంతి కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. హుస్నాబాద్ నియోజకవర్గం JAC కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ మలి దశ తెలంగాణ ఉద్యమం లో ప్రజలను చైతన్యం చేస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు బెల్లి లలితక్క ను 17ముక్కలు చేసి గోనె సంచులలో కట్టి చెరువు లలో, కుంటలలో వేశారు. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ కార్మికురాలు గా అనేక పోరాటాలను నిర్వహించింది. మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసి, భువనగిరి లో మహిళా సమస్య లను పరిష్కారం చేస్తూ, బస్తీ వాసుల సమస్య లను పరిష్కరించింది. వేశ్య వృత్తి లో మగ్గిన మహిళలను చైతన్యము చేసి, ఆ వృత్తి ని మాన్పించడం జరిగింది. ఫ్లోరైడ్ సమస్య పై ప్రజలను చైతన్య ము చేయడం జరిగింది. డోలుదెబ్బ ను స్థాపించి, గొల్ల, కురుమ సమస్య ల పై పోరాటాలను నిర్వహించడం జరిగింది. తెలంగాణ జనసభ ఆధ్వర్యంలో తెలంగాణ కళాసమితి కోకోన్వీనర్ గా ఉంటూ అనేక ఉద్యమాలను నిర్వహించింది. బెల్లి లలితక్క విగ్రహన్ని ట్యాంక్ బండ్ పై పెట్టాలని, భువనగిరి జిల్లాకు లలితక్క పేరు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో JAC భాద్యులు ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, గొర్లవీరన్న యాదవ్, మల్లం నరసింహ, సందేబోయిన రమేష్, సంపత్, రాగుల శ్రీనివాస్, దిలీప్, సందేబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
