మందు బాబులకు బ్యాడ్న్యూస్.. మళ్లీ మద్యం దుకాణాలు బంద్
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
జూన్ 4న తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపులు క్లోజ్ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 4న ఉదయం 6 నుంచి జూన్ 5న ఉదయం 5 గంటల వరకు దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 5వ తేదీన తిరిగి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.