మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన

మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన

మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన

ఉపాధ్యాయులు అంటే భయము భక్తి ఉండాలి

చదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదు

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దు

నూతన చట్టాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగింది

సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలి

హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

అవగాహన కల్పిస్తున్న హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు హుస్నాబాద్ సీఐ కోండ్ర శ్రీనివాస్ మరియు షీటీమ్ బృందం మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్ మరియు నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ  శ్రీనివాస్  మాట్లాడుతూ.. విద్యార్థి దశ చాలా కీలకం మీ దశను మీరే మార్చుకునే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది. ఇష్టపడి చదివి ఉన్నత స్థానానికి వెళ్లాలి, సమయము దొరికినప్పుడల్లా  మంచి మంచి మహానుభావుల చరిత్ర చదువుతూ ఉండాలి, కుటుంబంలో ఒక మహిళా చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఈ రోజులలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులను విద్య నేర్పిన గురువులను గౌరవిస్తూ ఉండాలి. తలదించుకొని చదివి తలెత్తుకుని బతకాలి, సోషల్ మీడియా వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ స్టేటస్ లలో, మీకు మీ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు పెట్టి ఇబ్బందులకు గురికావద్దు. అవసరం మేరకే సోషల్ మీడియాను వాడుకోవాలి, ప్రతి విద్యార్థికి చదువు చాలా ముఖ్యం, ఎవరికన్నా ఏదైనా జరిగితే మనకెందుకులే అని నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి, ఉన్నతంగా చదువుకుని పై స్థాయికి వెళ్ళాలి, ఒక మనిషికి రూపం ముఖ్యం కాదు గుణము వ్యక్తిత్వం చాలా ముఖ్యం, ఇష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించాలి, కుటుంబ సమస్యలను చదువుకు ముడి పెట్టవద్దు, ఉపాధ్యాయులు గురువులు అంటే భయం భక్తి ఉన్నవారు జీవితంలో వారు అనుకున్నది సాధిస్తారు. ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం, సైబర్ నేరాలు మన తప్పిదాల వల్లే జరుగుతున్నాయి  గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులు ఓపెన్ చేయవద్దు, మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ, మీ బంధువులు కానీ, ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930  కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

షీటీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి, ఇవి టీజింగ్, గుడ్ టచ్, బాడ్ టచ్ తదితర అంశాల గురించి, సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్ సెక్యూరిటీ, మైనర్ డ్రైవింగ్, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ డిఫెన్స్, మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100, లేదా సిద్దిపేట షీ టీమ్ నెంబర్ 8712667434 కాల్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టర్ వెంకటయ్య , అధ్యాపకులు, హుస్నాబాద్  షీటీమ్ బృందం సదయ్య, మహిళా కానిస్టేబుల్లు స్వప్న, ప్రశాంతి, కానిస్టేబుల్ కృష్ణ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *