హుస్నాబాద్: అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

హుస్నాబాద్: అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

హుస్నాబాద్ పట్టణంలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు హుస్నాబాద్ పోలీసులు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

అక్రమంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & హుస్నాబాద్ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం సాయంత్రం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం నుండి పోతారం వెళ్లే రోడ్డులో టాటా ఏస్ వాహనం ( TS02UC-3059) లో గంట అంకుష్ (గ్రామం కొండాపూర్, మండలం చిగురుమామిడి) తన వాహనంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు హుస్నాబాద్  పోలీసులు వెళ్లి కలిసి స్వాధీనం చేసుకుని నిందితున్ని విచారించగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన అనిల్, రాజు ఇండ్లలో అక్రమంగా రేషన్ బియ్యం దాచి పెట్టారని తెలుపగా పోలీసులు వెళ్లి తనిఖీలు చేయగా వారి ఇళ్లలో నిల్వ ఉంచిన 80 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులపై హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ… పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *