హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
చైర్మన్ గా కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ గా బంక చందు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం బాధ్యతలు చేపట్టింది. మార్కెట్ కమిటీ ఆవరణలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో చైర్మన్ గా కంది తిరుపతి రెడ్డి తో పాటు వైస్ చైర్మన్ గా బంక చందు, ఎక్స్ అఫీషియో డైరెక్టర్ లుగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, డైరెక్టర్లుగా బోడిగే పరుశరాములు, పత్తిపాక తిరుపతి, ఓరుగంటి భారతి, పోతుగంటి బాలయ్య, మహమ్మద్ కుతుబుద్దిన్, బొంగోని శ్రీనివాస్, లావుడియా బిక్య నాయక్, మడప యాదవ రెడ్డి, కరంటోతూ రవి, బైకాని శ్రీనివాస్, తీరాల మారుతి, తణుకు ఆంజనేయుల తో పాటు మార్కెటింగ్ ఏడీ, అగ్రికల్చర్ ఆఫీసర్ తదితరులు డైరెక్టర్లుగా ప్రమాణం స్వీకారం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి అన్నారు. పంట కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు, మార్కెట్ కమిటీ ఆదాయ పెంపునకు డైరెక్టర్లు, రైతుల సహకారంతో కృషి చేస్తానన్నారు.