రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం..
ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారణ..
మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బ్యూరో.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 17 మృతి.. పోలీసుల నిర్ధారించారు. కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే డ్రైవర్ మృతి చెందాడు. బస్సులో కంకర పడడంతో కంకర కింద మరికొంతమంది ప్రయాణికులు కూరుకుపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు, స్థానికులు తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..





