ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

ప్రజా ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవం

విద్యార్థి దశ నుంచే పోరుబాట.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం.

క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీలో గుర్తింపు.

నేడు సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న కేడం లింగమూర్తి

సిద్దిపేట టైమ్స్ డెస్క్:

విద్యార్థి దశ నుంచే పోరుబాట పట్టి దళిత బహుజనుల సమస్యలపై విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తూ హుస్నాబాద్ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకులు కేడం లింగమూర్తి. విద్యార్థి నాయకుడిగా మొదలుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంచలంచలుగా ఎదిగి నేడు సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న కేడెం లింగమూర్తి ప్రస్థానం. కేడం ఎంకమ్మ-లక్ష్మయ్య దంపతులకు నలుగురి సంతానంలో మూడవ సంతానంగా 10 అక్టోబర్ 1964 కేడం లింగమూర్తి జన్మించాడు. డిగ్రీ బిఏ పూర్తి చేశాడు. వీరి సొంత గ్రామం పోచమ్మ వాడ,హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట.

వివిధ స్థాయిలో చేపట్టిన బాధ్యతలు:

కాంగ్రెస్ పార్టీలో చేరిన  31 అక్టోబర్ 1984 చేరాడు. 1980-81 లో హస్నాబాద్ హైస్కూల్ స్టూడెంట్  యూనియన్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ఇందుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,1985 కాంగ్రెస్ సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ శతజయంతి ఉత్సవాలలో తన వంతు పాత్ర పోషించాడు. 1988  గుంటూరు జిల్లా సూర్యలంకలో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ శిక్షణ శిబిరంలో 10 రోజుల శిక్షణ తీసుకోవడం జరిగింది.1990 తిరుపతిలో జరిగిన ప్లీనరీ సభకు ట్రేన్డ్ కాంగ్రెస్ కార్యకర్తగా కమిటీకి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. 1989-90 నుంచి నియోజకవర్గ (ఏసిడిపి) అసెంబ్లీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ మెంబర్ గా పనిచేయడం జరిగింది. 1991 లో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. 1991 నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా 2006 వరకు పనిచేశారు. 2000 సంవత్సరం నుంచి 2016 వరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. 2006 నుండి నాలుగు పర్యాయాలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగారు. 2006 నుంచి 2011 వరకు హుస్నాబాద్ సర్పంచ్ గా పనిచేశారు. 2007 నుంచి నేటి వరకు బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 2018 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశాలు తిరుపతి,కలకత్త, సూరజ్, కుండు,ఢిల్లీ, బొంబాయిలలో జరిగిన జాతీయ స్థాయి సమావేశాలకుహాజరైనారు. కాంగ్రెస్ పార్టీలో లింగమూర్తి చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం 10 అక్టోబర్ 2024 రోజున సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా ప్రకటించారు. 17 అక్టోబర్ 2024 రోజున పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలు:

హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో లింగమూర్తి ఎంతో కృషి చేశారు. అలాగే హుస్నాబాద్ లో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకాన్ని ప్రదర్శించడంలో తన వంతు సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా నిలిచారు. 1988 లో అంబేద్కర్ హమాలి సంఘం గౌరవాధ్యక్షులుగా, 1989 లో అంబేద్కర్ తాపీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులుగా 2023 లో హుస్నాబాద్ ఎలక్ట్రిషన్ & ప్లంబర్ సంఘాల గౌరవాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 2018 లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు జరిగినప్పుడు కరీంనగర్ జిల్లాలోనే హుస్నాబాద్ కొనసాగించాలని, హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ ఏర్పరచాలని ఉద్యమం చేశారు. హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎత్తేవేసినప్పుడు తిరిగి తీసుకువచ్చే కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి బస్సు యాత్ర పాదయాత్రల సందర్భంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో ఆర్జీలు పెట్టిన నిస్వార్థ సేవకుడు కేడం లింగమూర్తి.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రకాల ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన నాయకుడిగా హుస్నాబాద్ ప్రాంతంలో నిలిచారు. చిద్రమవుతున్న రైతుల బతుకులు బాగుపడాలంటే  మేట్ట ప్రాంతమైన హుస్నాబాద్ లో రిజర్వాయర్ కట్టాలని 2007 లో ఎన్టిపిసి బహిరంగ సభకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని అతిథి గృహంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వైయస్సార్ తప్పకుండా చేద్దామని మాట ఇచ్చారు. ముల్కనూర్ సొసైటీ బ్యాంక్ 50 సంవత్సరాల ఉత్సవాలకు వచ్చినప్పుడు 100 మీటర్ల బ్యానర్ తో అపర భగీరథుడు అని ఊరేగింపు నిర్వహిస్తే వైయస్సార్ దగ్గరకు పిలుచుకొని అభినందించాడు. అదే వేదికలో గౌరవెల్లి, గండి పల్లి రిజర్వాయర్ ను ఇస్తున్నానని ప్రకటన చేయడం జరిగింది.గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టు ముంపు బాధితుల పక్షాన ధర్నాలు అరెస్టులు కోర్టు కేసులలో తనదైన శైలిలో పేదల కోసం తన వంతు పాత్ర పరిపూర్ణంగా పోషించారు. హుస్నాబాద్ అభివృద్ధిలో డిగ్రీ కాలేజ్,100 పడకల ఆసుపత్రి,మెడికల్ కాలేజ్ కోసం మరియు హుస్నాబాద్ నియోజకవర్గనికి పరిశ్రమలు రావాలని నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు రావాలని తద్వారా ఇక్కడి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని
తపనపడుతున్న ప్రజా నాయకుడికి అరుదైన గౌరవం దక్కింది. సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పదవి రావడంలో సహకరించిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *