హుస్నాబాద్ మండలంలో పిడుగుపాటుకు పాడి గేదె మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి మండల పరిధిలోని తోటపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బంక మల్లవ్వ w/o యాదగిరి కి చెందిన పాడి గేదె మృతి చెందింది. రోజు మాదిరిగానే బావి దగ్గర కట్టేసి బుధవారం ఉదయం బావి దగ్గరికి పోయేసరికి చనిపోయి వుంది ఆ బావుల దగ్గర వున్న రైతులు ఉదయం పిడుగుపాటుతో చనిపోయిందని అని తెలిపారు. గేదె మృతితో రూ.70 వేల రూపాయల నష్టం వాటిల్లిందని, దానితోనే పాటు ఆ కుటుంబం జీవనోపాధి కోల్పోయారని కావున వ్యవసాయ కూలీ బంక మల్లవ్వను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.